మామిడి రైతుల ప్రయోజనాలే ముఖ్యం

మామిడి రైతుల ప్రయోజనాలే ముఖ్యం
  • అధిక కమీషన్లు వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తం
  • గడ్డిఅన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి 

అబ్దుల్లాపూర్​ మెట్, వెలుగు: మామిడి రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఈ సీజన్​లో మార్కెట్​లో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని గడ్డిఅన్నారం ఫ్రూట్​మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్​రెడ్డి చెప్పారు. బాటసింగారంలోని మార్కెట్​ఆఫీసులో సోమవారం మామిడి సీజన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. కొందరు వ్యాపారులు మాట్లాడుతూ.. మార్కెట్​లో చాలా సమస్యలు ఉన్నాయని, అధికారులు, పాలకవర్గం స్పందించి వెంటనే పరిష్కరించాలని కోరారు. 

మార్కెట్ కమిటీ చైర్మన్​ మధుసూదన్​రెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్​లోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. రైతులు, వ్యాపారులు, అధికారులను  సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు. మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అధిక కమీషన్లు వసూలు చేస్తే మార్కెట్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అబ్దుల్లాపూర్​మెట్ ఇన్​స్పెక్టర్​అంజిరెడ్డి, వనస్థలిపురం ట్రాఫిక్​ఇన్​స్పెక్టర్​జి.గట్టుమల్లు, హయత్​నగర్​ఇన్​స్పెక్టర్​యాదగిరి, మార్కెట్ వైస్ చైర్మన్ సీహెచ్​భాస్కరాచారి, మార్కెట్​డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.