
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్గాంధీ ఆస్పత్రిలో అమర్నాథ్ యాత్రికులకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సోమవారం మొదలైంది. ఆస్పత్రి మెయిన్బిల్డింగ్ మొదటి అంతస్తులోని మెడికల్ రికార్డ్స్ విభాగం(ఎంఆర్డీ)లో ప్రభుత్వం నియమించిన నలుగురు డాక్టర్ల బృందం దరఖాస్తుదారుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు. బ్లడ్టెస్టులు, ఎక్స్ రే రిపోర్టులను పరిశీలిస్తున్నారు. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటే ఫిట్ నెస్సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. సర్టిఫికెట్లు పూర్తిగా ఉచితమని, ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సర్టిఫికెట్ల అందజేస్తామని అధికారులు తెలిపారు.
ఈ రిపోర్టులు తప్పనిసరి:
సీబీపీ, ఈఎస్ఆర్, సీయూఈ, ఈసీజీ, బ్లడ్యూరియా, బిఫోర్లంచ్, ఆప్టర్లంచ్ షుగర్ టెస్టులు, బ్లడ్ గ్రూప్ ఆర్హెచ్టైప్, సీరం క్రియేటిన్, చెస్ట్ఎక్స్రే రిపోర్టులను మెడికల్ బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇక 50 ఏండ్ల వయస్సు పై బడినవారు అదనంగా రెండు మోకాళ్లు, ఎక్స్రేలు జతపరచాల్సి ఉంటుంది. వీటితోపాటు ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసిన అప్లికేషన్ఫారం, గాంధీలో ఇచ్చే అప్లికేషన్ఫారాలను నింపి, ఒక ఫొటో జతచేసి ఇవ్వాలి. ఈ వైద్య పరీక్షలన్నీ బయట ల్యాబ్లలో కూడ చేసుకోవచ్చు. సదరు రిపోర్టులను గాంధీలో ఇవ్వాల్సి ఉంటుంది.