
గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఓపెన్ కాస్ట్ 3, 5 ప్రాజెక్ట్లలో చేస్తున్న భారీ బ్లాస్టింగ్ల వల్ల 10, 11, 12, 13, 33, 34 డివిజన్లతో పాటు గోదావరిఖని ప్రాంతంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొంటూ 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత, రవీందర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఓసీపీ 5ను ముట్టడించారు. రోడ్డుపైనే బైఠాయించి సింగరేణి మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్లాస్టింగ్ తగ్గించేలా చర్యలు తీసుకుంటామని ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.