ఆల్యాతండాలో ట్రైనీ ఐఏఎస్ ల పర్యటన

ఆల్యాతండాలో ట్రైనీ ఐఏఎస్ ల పర్యటన

కారేపల్లి, వెలుగు: మండలంలోని ఆల్యాతండాలో ట్రైనీ ఐఏఎస్ ల బృందం మంగళవారం పర్యటించింది. ట్రైనీ ఐఏఎస్ బృందం సభ్యులు అల్తమాష్ గాజీ, వైభవ్ మీనా, తేజస్విని, అనితా మీనా, విపులా సింఘాల్ గ్రామంలోని అంగన్​వాడీ కేంద్రాన్ని సందర్శించారు. మహిళా సంఘాలకు మంజూరు చేసిన రుణాలను వారు సద్వినియోగం చేసుకుంటున్న తీరు గురించి సంఘం సభ్యులను అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంప్రదాయాలు, గిరిజన గ్రామాల సమస్యలపై అధ్యయనం చేశారు.