
హనుమకొండ/ పర్వతగిరి (గీసుగొండ), వెలుగు: ఆహారపదార్థాల దుకాణాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ గాంధీనగర్ పోచమ్మ గుడి సమీపంలోని మొహమ్మద్ జాన్ పాషాకు చెందిన షామా అనే ఐస్ క్రీమ్ తయారీ, డిస్ట్రిబ్యూషన్ షాప్లో ఫుడ్సేఫ్టీ నియమాలు, ఎక్స్పైరీ తేదీలు లేకుండా తయారు చేస్తున్నట్టు టాస్క్ ఫోర్స్పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి, పాడైన, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ.25,740 విలువైన దాదాపు 14 రకాల ఐస్ క్రీమ్ ప్రొడక్ట్స్సీజ్చేశారు. వరంగల్జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట ప్రగతి ఇండస్ర్టీయల్ సమీపంలోని కృప బేకరీలో నిర్వహించిన తనిఖీల్లో రూ.32,550 విలువైన 6510 కుళ్లిన కోడి గుడ్లు, బేకరీలో ఉపయోగించే లిక్విడ్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రైడ్స్లో టాస్క్ఫోర్స్ సీఐ బాబులాల్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వేణు, కృష్ణమూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.