పాకిస్తాన్‌లో హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి

పాకిస్తాన్‌లో హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో శనివారం ఘోర ప్రమాదం జరి గింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని వజీరిస్తాన్ జిల్లాలో ప్యాసింజర్లతో కూడి న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఆయిల్ కంపెనీకి చెందిన చార్టర్డ్ హెలికాప్టర్.. టేకాఫ్ అయిన వెం టనే ఇంజన్​లో టెక్ని కల్ ఇష్యూ తలెత్తిందని అధికారులు తెలిపారు.

దాంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేస్తుండగా హెలికా ప్టర్‌ కుప్పకూలింద ని వెల్లడించారు. ప్రమా ద సమయంలో అందులో మొత్తం 14 మంది ఉన్నట్లు తెలిపారు. మరణించి న వారిలో ముగ్గురు ర ష్యా పౌరులు, ఇద్దరు పైలెట్లు, ఒక సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై ఖైబర్ పఖ్తుంఖ్వా గవర్నర్ ఫైసల్ కరీం కుండి విచారం వ్యక్తం చేశా రు. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై  దర్యాప్తు చేయాలని ఆదేశించారు.