స్టేషన్ఘన్పూర్, వెలుగు: ఆర్టిఫియల్ ఇంటలిజెన్సీ(ఏఐ)తో న్యాయసేవల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయని రాష్ట్ర హైకోర్టు జడ్జి, జనగామ అడ్మినిస్ట్రేటివ్జడ్జి సూరెపల్లి నంద తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్మున్సిపాల్టీలోని పాత ఎస్సీ హాస్టల్ బిల్డింగ్లో కొత్తగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్జడ్జి, ఫస్ట్ క్లాస్కోర్టును శనివారం సాయంత్రం ఆమె ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ టెక్నాలజీని ఉపయోగించి నాణ్యమైన న్యాయసేవలతోపాటు వేగంగా పరిష్కరిస్తామన్నారు. సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు శాయశక్తులా కృషిచేస్తామన్నారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ మాట్లాడుతూ స్టేషన్ఘన్పూర్మున్సిపాల్టీ ఏర్పడిన కొద్ది రోజులల్లోనే ఇక్కడ కోర్టు ప్రారంభించడంతో ప్రజలకు సత్వరంగా న్యాయ సేవలు అందుతాయన్నారు.
అనంతరం హైకోర్టు జడ్జి సూరెపల్లి నందను జనగామ, స్టేషన్ఘన్పూర్బార్అసోసియేషన్సభ్యులు గజమాలతో సన్మానించారు. అడిషనల్కలెక్టర్ పింకేశ్కుమార్, జిల్లా పర్సనల్సెషన్స్జడ్జి రవీంద్రశర్మ, డీసీపీ రాజమహేంద్రనాయక్, జనగామ బార్అసోసియేషన్ప్రెసిడెంట్చంద్రరుషి, స్టేషన్ఘన్పూర్బార్అసోసియేషన్సభ్యులు కనకం రమేశ్, గుర్రపు బాబురావు, గద్దె అనిల్, పోగుల కార్తీక్, గట్టు రవి పాల్గొన్నారు.