
వ్యవసాయ సంబంధ పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్కు నిర్దేశించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్- ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ (ఐకార్- ఏఐఈఈఏ పీజీ)-2023 నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సుల్లో ప్రత్యేకించిన సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు.
విభాగాలు: ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్, ఎంటమాలజీ అండ్ నెమటాలజీ, అగ్రోనమీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టికల్ సైన్సెస్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్, యానిమల్ బయోటెక్నాలజీ, వెటర్నరీ సైన్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్, బీవీఎస్సీ, బీఎఫ్ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 31 ఆగస్టు 2023 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్లో 120 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 16 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.icar.nta.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.