ఇల్లెందులో ప్రిన్సిపల్ నిత్యావసర సరుకులు పంపిణీ

ఇల్లెందులో ప్రిన్సిపల్ నిత్యావసర సరుకులు పంపిణీ

ఇల్లెందు, వెలుగు : బుగ్గ వాగు పరివాహక ప్రాంతాలైన 2,3,5 వార్డులలోని వరద బాధితులకు గురువారం ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో గురువారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  ఇల్లెందు మండల న్యాయ  సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో  మండల న్యాయ  సేవా అధికార సంస్థ చైర్మన్, ఇల్లెందు జడ్జి  దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి బాధితులకు అందజేశారు. బుగ్గవాగు వదర ప్రాంతాల్లో గురువారం ఇల్లెందు మున్సిపల్​ చైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పర్యటించి శానిటేషన్​ పనులు చేపట్టాలని సూచించారు. 

 మానవత్వం చాటుకున్న ఫొటో గ్రాఫర్లు

ఖమ్మం రూరల్ : మున్నేరు వరద బాధితుల్లో ఖమ్మం ఫొటో గ్రాఫర్ కుటుంబాలు కూడా ఉన్నాయి. మానవతా దృక్పదంతో ఖమ్మం ఫొటోగ్రఫీ యూనియన్ నాయకులు వారందరినీ ఆదుకునేందుకు పూనుకున్నారు. సుమారు 26 మందిని తీవ్ర నష్టానికి గురికాగా వారందరికీ తక్షణ సహాయం చేశారు. జిల్లా యూనియన్ ఫండ్, రాష్ట్ర యూనియన్ ఫండ్, ఖమ్మం ఫొటో గ్రాఫర్స్ విరాళాలు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 10 లక్షలు విరాళాలు సేకరించారు. 26 కుటుంబాలకు రూ.35 వేలు నగదు, రూ. 3వేల విలువ గల నిత్యావసరాలు అందజేశారు. ఫొటోగ్రాఫర్స్​ యూనియన్​ జిల్లా అధ్యక్షుడు నాగరాజు దేవర అధ్యక్షతన ఖమ్మం సిటీలోని  జూబ్లీక్లబ్ బాధిత కుటుంబాలకు అందజేశారు