ఇన్వెస్టర్లకు రూ. 6 లక్షల కోట్ల లాస్

ఇన్వెస్టర్లకు రూ. 6 లక్షల కోట్ల లాస్
  •     సెన్సెక్స్ 494 పాయింట్లు డౌన్​
  •     221 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

న్యూఢిల్లీ : విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోవడంతో గురువారం మార్కెట్లు నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 6 లక్షల కోట్లు తగ్గింది. బీఎస్​ఈ సెన్సెక్స్ 494.75 పాయింట్లు తగ్గి 81,006.61 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 595.72 పాయింట్లు పడిపోయి 80,905.64 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 221.45 పాయింట్లు నష్టపోయి 24,749.85 పాయింట్ల వద్ద ఆగింది. బీఎస్​ఈ -లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,03,862.06 కోట్లు తగ్గి రూ. 4,57,25,183.01 కోట్లకు చేరింది.

సెప్టెంబరు క్వార్టర్​లో లాభం తగ్గడంతో నెస్లే షేరు ధర 3 శాతానికి పైగా క్షీణించింది.  సెన్సెక్స్​లో  మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్వ్, టైటాన్, టాటా స్టీల్, మారుతీ  యాక్సిస్ బ్యాంక్ కూడా నష్టపోయాయి.  ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఎల్​ అండ్​ టీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా లాభపడ్డాయి.   ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు బుధవారం రూ. 3,435.94 కోట్ల విలువైన షేర్లు అమ్మారు