
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై.. మాజీ సీఎం జగన్ పంచ్ వేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలంటూ ఆయన చేసిన కామెంట్లను ప్రస్తావించారు జర్నలిస్టులు.
దీనిపై స్పందించిన మాజీ సీఎం జగన్.. పవన్ కల్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ.. జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు అంటూ కామెంట్స్ చేశారు.
పవర్ ఫుల్ పంచ్ :
— Anitha Reddy (@Anithareddyatp) March 5, 2025
పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కి ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ.. అతనికి ఏం తెలుస్తుంది? జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు 🤣 - జగనన్న pic.twitter.com/dvY8vdzzNU
Also Read : ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు
ఏపీ అసెంబ్లీలో కూటమిలోని మూడు పార్టీలు ఒక వైపు ఉన్నాయని.. ప్రతిపక్షంగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉంటే.. మూడు సీట్లు గెలిచిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. సీట్లు తక్కువ వచ్చినా.. 40 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ కు లేఖ రాసిన విషయం నిజమే అని.. ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు మాజీ సీఎం జగన్