
జనగామ అర్బన్/ రఘునాథపల్లి, వెలుగు: ఉపాధి కూలీ పని ఇలా చేయాలి అంటూ జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కాసేపు వారితో కలిసి పని చేస్తూ ఉత్సాపరిచారు. మంగళవారం రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలో ఆయన ఉపాధి పనులను పరిశీలించి, సమస్యలపై ఆరా తీశారు. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండల పరిధిలోని నిడిగొండకు చెందిన ఆశా కార్యకర్త మహేశ్వరి ఇటీవల గుండెపోటుతో మృతి చెందింది.
మండల ఆశాకార్యకర్తలు, ప్రైమరీ హెల్త్ సెంటర్ల సిబ్బంది, ఆరోగ్యశాఖ ఆఫీసు నుంచి మొత్తం రూ.1.32 లక్షలు మృతురాలు కుటుంబానికి కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అంతకుముందు కలెక్టర్ జనగామ మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లోని మెయిన్ గేట్వద్ద సెర్ప్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు.