
- నెలాఖరు వరకు డెడ్లైన్
- 5 వేల పై చిలుకు వాహనాల పన్నులు పెండింగ్
- చెల్లింపుల్లో నిర్లక్ష్యంపై రవాణా శాఖ సీర్యస్
జనగామ, వెలుగు: వాహనాల ట్యాక్స్ వసూళ్లపై రవాణా శాఖ అధికారులు స్పెషల్ ఫోకస్పెట్టారు. ఈ నెలాఖరు వరకు 100 శాతం వసూలే లక్ష్యంగా పెట్టుకున్నారు. జనగామ జిల్లాలో సుమారు 6 వేల పై చిలుకు వాహనాల బకాయిలు పెండింగ్లో ఉండగా, అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. నోటీసులు జారీ చేసి సకాలంలో స్పందించకుంటే రిజిస్ట్రేషన్లను సస్పెండ్చేస్తామని హెచ్చరిస్తున్నారు. వాహన ట్యాక్స్ రూపంలో జనగామ జిల్లాలో ప్రతీ యేటా రూ.6 కోట్ల 96 లక్షలు టార్గెట్ఉండగా, ఇప్పటి వరకు రూ.6 కోట్ల 4 లక్షలు వసూలు అయ్యాయి.
పేమెంట్లేట్..
జనగామ జిల్లాలో ట్యాక్స్వాహనాలు 12 వేల వరకు ఉన్నాయి. ఈ వాహనాలు ప్రతీ మూన్నెళ్లకు ఒకసారి ట్యాక్స్పేమెంట్చేయాల్సి ఉండగా, పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 2350 వాహనదారులు ఇంకా ట్యాక్స్ చెల్లించాల్సి ఉండగా, నోటీసులు అందించారు. ఈ నెలాఖరు వరకు చెల్లించక పోతే తదుపరి శాఖా పరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.
జిల్లా పరిధిలో 1300 ట్యాక్సీ కార్లు ఉండగా, 317 బకాయిలు చెల్లించాల్సి ఉంది. 197 స్కూల్ బస్సులు ఉండగా, వీటిలో 6 బస్సులకు సంబంధించి ట్యాక్స్ పెండింగ్లో ఉంది. కాగా, ఈ ఆరు బస్సులు స్క్రాప్నకు సిద్ధంగా ఉన్న కారణంగా చెల్లించనట్లు అధికారులు తెలిపారు. 810 హార్వెస్టర్లు ఉండగా, వీటిలో 201 వాహనాల ట్యాక్స్పెండింగ్లో ఉంది. ట్రాక్టర్ట్రాలీలు 5002 ఉండగా, 1210 వాహనదారులు బకాయిలు చెల్లించాల్సి ఉంది.
గ్రీన్ ట్యాక్స్లూ పెండింగ్..
15 ఏండ్ల వ్యాలిడిటీ గడువు తీరిన వాహనాలకు రవాణా శాఖ గ్రీన్ట్యాక్స్లు వసూలు చేసి, మరో ఐదేండ్ల కాల పరిమితిని పెంచుతోంది. ఎల్లో ప్లేట్వాహనాలైతే ఏడేండ్లకే గ్రీన్ట్యాక్స్చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం టూ వీలర్కు రూ.2,500, కార్లకు రూ.5 వేలు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వాహనదారులు నిర్ణీత గడువులోపు చెల్లించకుంటే టూ వీలర్కు ప్రతీ నెల రూ.300, కార్లకు రూ.500 జరిమానా విధించనున్నారు. ఈ లెక్కన రెన్యువళ్ల భారం తడిసి మోపెడుకానుంది. అందుకోసం సకాలంలో రెన్యువల్స్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
కాగా, జనగామ జిల్లాలో వివిధ రకాలకు చెందిన 5,518 వాహనాల వ్యాలిడిటీ పూర్తి కాగా, రూ.48 లక్షల గ్రీన్ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. టూ వీలర్వాహనాలు 3362, కార్లు 736 ఉన్నాయి. ట్రాక్టర్లు 694, ట్రాక్టర్ ట్రాలీలు 567, హార్డెస్టర్లు 77, ఓమ్నీ వ్యాన్లు 59 పెండింగ్ లో ఉన్నాయి. వీటితో పాటు 9 జీపులు, 5 మోపెడ్లు గ్రీన్ట్యాక్స్చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.41 లక్షలు వసూలైనట్లు అధికారులు చెబుతున్నారు.
సకాలంలో చెల్లించక పోతే చర్యలు..
బకాయిల పెండింగ్పై ప్రత్యేక దృష్టి సారించాం. ఈనెలాఖరు వరకు స్పెషల్డ్రైవ్ కొనసాగుతుంది. వాహనదారులు నిర్ణీత గడువులోగా ట్యాక్స్ చెల్లించాలి. 15 ఏండ్ల గడువు తీరిన వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. వ్యాలిడిటీ ముగిసిన వాహనాలు రోడ్డెక్కితే సీజ్చేస్తాం.
అందుకోసం సదరు వాహనాలకు గ్రీన్ట్యాక్స్ ను వెంటనే చెల్లించాలి. లేదంటే వీరికి ప్రతీ నెల జరిమానా పడుతూ వస్తుంది. నెలలు గడిచిన కొద్ది భారం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కార్ల గ్రీన్ట్యాక్స్పెంపు పై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. అందుకోసం ఇప్పుడు చెల్లిస్తే ప్రస్తుత రూల్స్మేరకు తక్కువ మొత్తంతో రెన్యువల్స్పూర్తి కానున్నాయి.
- జీవీ శ్రీనివాస్గౌడ్, జిల్లా రవాణా శాఖ అధికారి, జనగామ