ఎగ్జామ్స్​కు బాగా ప్రిపేర్ కావాలి

ఎగ్జామ్స్​కు బాగా ప్రిపేర్ కావాలి

జనగామ అర్బన్, వెలుగు: టెన్త్​ ఎగ్జామ్స్​కు స్టూడెంట్లు బాగా ప్రిపేర్​కావాలని, ఆందోళనకు గురి కావద్దని, ఫలితాల్లో టాపర్​గా నిలిచిన విద్యార్థులకు మండల, జిల్లా స్థాయిలో బహుమానం అందిస్తామని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్ అన్నారు. ఈ నెల మార్చి 21 నుంచి ఏప్రిల్​ 4 వరకు టెన్త్​ ఎగ్జామ్స్​ జరగనున్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్​హాల్​నుంచి జూమ్​మీటింగ్​ ద్వారా పదో తరగతి పరీక్షలు రాసే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్​ స్కూల్​ విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. 

ఈ మీటింగ్​ ద్వారా టీచర్లు పరీక్షా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ అంశాల లో విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. మీటింగ్​లో అడిషనల్​ కలెక్టర్​ పింకేశ్​కుమార్, డీఈవో రమేశ్, ఏసీజీ రవికుమార్, జీసీడీవో గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్​ ధర్మకం ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో కొనసాగుతున్న ఇంటర్​ ఎగ్జామ్స్​ను ఆకస్మిక తనిఖీ చేశారు.  సెంటర్​లో వసతులపై ఆరా తీశారు. తనిఖీల్లో డీఐఈవో జితేందర్​రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.