పట్టాణాభివృద్ధికి సహకరించాలి : ​ రిజ్వాన్​ బాషా షేక్

పట్టాణాభివృద్ధికి సహకరించాలి : ​ రిజ్వాన్​ బాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు :  పన్నులు చెల్లించి పట్టాణాభివృద్ధికి సహకరించాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ బట్టల షాపులో మున్సిపల్​ సిబ్బంది చేస్తున్న ఆస్తి పన్ను వసూళ్లను ఆయన గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో సదరు బట్టల షాప్​ యజమాని చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని కలెక్టర్​ చేతుల మీదుగా కమిషనర్​కి అందించారు. 

కలెక్టర్​మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీ స్థాయిలో 95 శాతం పన్ను వసూలు జరిగిందని, మున్సిపల్​ పరిధిలో ఇప్పటివరకు 44 శాతం పన్ను వసూళ్లు అయ్యాయన్నారు. ఇందుకోసం మున్సిపల్​ పరిధిలో 30 యాక్షన్​ టీం, స్పెషల్​ టీం లను ఏర్పాటు చేశామన్నారు. బకాయిదారులు సకాలంలో పన్ను చెల్లించాన్నారు. కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్​ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.