
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, సీఎస్, డీజీపీ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
2 నిమిషాల 32 సెకన్ల నిడివితో జయజయహే తెలంగాణ సాంగ్ ను రిలీజ్ చేశారు. పరేడ్ గ్రౌండ్ వేదికపై నుంచి పాటను వినిపించారు. రాష్ట్ర గీతం ఆవిష్కరణ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు గీత రచయిత అందెశ్రీ. ఈ కార్యక్రమంలో నేతలు, ప్రజలు కరతాళ ధ్వనులు చేశారు. కార్యక్రంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పాల్గొన్నారు.