
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వందన తెలిపారు. టెక్ మహీంద్రా కంపెనీలో 100 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగులు గురువారం ఉదయం 11 గంటలకు మల్లేపల్లి గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలోని జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసుకు బయోడేటా, సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 83284 28933లో సంప్రదించాలని సూచించారు.