
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. వివేకాంద కాలనీలోని రేషన్ షాపులో తూకాన్ని పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. బియ్యం ఎలా ఉన్నాయి.. తూకం కరెక్ట్ ఉంటుందా.. అని అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం ఇస్తున్నందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట డీఎస్వో మల్లికార్జునబాబు, తహసీల్దార్ జనార్దన్ తదితరులు ఉన్నారు. జిల్లాలోని ఆయా చోట్ల ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ బియ్యం పంపిణీ పక్రియను పరిశీలించారు.
డిస్ట్రిక్ఇండస్ట్రియల్ కమిటీ మీటింగ్
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ డిస్ట్రిక్ఇండస్ట్రియల్ కమిటీ మీటింగ్ జరిగింది. టిప్ రైడ్, ఎస్సీపీ స్కీమ్ ఏజెండా అంశాలపై చర్చించారు. ఈ స్కీమ్ల కింద 3 అప్లికేషన్లకు సబ్సిడీ రూ. 6 లక్షల 92వేలు ఇచ్చేందుకు ఆమోదించారు. టీఎస్పీ కింద 14 అప్లికేషన్లకు రూ. 44 లక్షలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో ఇండస్ట్రియల్ జిల్లా జీఎం వి.లాలూ, అధికారులు పాల్గొన్నారు.