అంగన్ వాడీ సెంటర్లలో తనిఖీ చేయాలి : ​ ఆశిశ్ సంగ్వాన్

అంగన్ వాడీ సెంటర్లలో తనిఖీ చేయాలి : ​ ఆశిశ్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు:  సీడీపీవోలు, సూపర్​ వైజర్లు అంగన్​వాడీ సెంటర్లలో  క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిశ్ సంగ్వాన్ సూచించారు.  బుధవారం కలెక్టరేట్‌లో  ఐసీడీఎస్​పై సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్​ జరిగింది.  కలెక్టర్​ మాట్లాడుతూ..  నెలలో కనీసం రెండు ‌‌సెంటర్లను తనిఖీ చేయాలన్నారు.  బాలామృతం సెంటర్లలో  పరిసరాల శుభ్రత సరకుల స్టాక్​ రిజిస్టర్లు పరిశీలించాలన్నారు.  సెంటర్లలో పిల్లల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంటుందని గమనించామన్నారు.

 నిర్మాణంలో ఉన్న అంగన్ వాడీ బిల్డింగ్‌లను పూర్తి చేయాలని సూచించారు.  శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్​లో సెంటర్లు నడపకూడదన్నారు. కరెంట్ కనెక్షన్ లేని వాటిని గుర్తించి వెంటనే మీటర్లు బిగించాలని విద్యుత్తు శాఖ ఎస్​ఈ శ్రవణ్‌ కుమార్‌‌ ను ఆదేశించారు. సెంటర్లకు తాగునీటిని సప్లయ్​ చేయాలని మిషన్​ భగీరథ అధికారులకు సూచించారు. జిల్లా ఐసీడీఎస్​అధికారి ప్రమీల, విద్యుత్తు శాఖ ఎస్ఈ శ్రవణ్ కుమార్, పంచాయతీరాజ్​ ఈఈ దుర్గాప్రసాద్,  మిషన్​ భగీరథ ఈఈ రమేశ్,  అధికారులు పాల్గొన్నారు.