
- బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేడర్కు దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్కు రానున్నారు. బుధవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాల వంటి వాటిపై పార్టీ కేడర్కు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ బయటకు రాకపోతుండడంతో కేడర్లో కొంత నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించనున్న విస్తృత స్థాయి సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకున్నది.