సీఎంఆర్​ చెక్కులు పంపిణీ

సీఎంఆర్​ చెక్కులు పంపిణీ

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం నగరంలోని 57 వ డివిజన్ కు చెందిన 9 మంది అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్స పొందిన వారికి సీఎంఆర్ ​చెక్కులను బుధవారం ఆ డివిజన్ కార్పొరేటర్ రఫీదా బేగంతో కలిసి మేయర్ పూనుకొల్లు నీరజ అందజేశారు.

 అనంతరం నగర శివారులోని డంపింగ్ యార్డులో అంతర్గత మెటల్ రోడ్డు పనులను ఆమె ప్రారంభించారు. మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ.20 లక్షలతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.