ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ ​చేయాలి : శ్రీజ

 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ ​చేయాలి : శ్రీజ
  • ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీజ

మధిర, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు స్పీడప్​చేయాలని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీజ అధికారులకు సూచించారు.  మధిర మండలంలోని మోడల్​ విలేజ్​గా ఎంపికైన చిలుకూరు గ్రామాన్ని మంగళవారం  ఆమె సందర్శించారు.  

చిలుకూరు గ్రామానికి గృహ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 37 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం స్కూల్​భవనాలను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏపీఎం శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి మరీదు కొండలరావు, నాయకులు నిడమానూరు వంశీకృష్ణ, లబ్ధిదారులు ఉన్నారు.