
కూసుమంచి, వెలుగు : ఇటీవల కురిసిన వానలకు గండి పడిన కాలువ రిపేర్లు ఆఫీసర్లు సోమవారం మొదలుపెట్టారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పాలేరు మినీ హైడల్ విద్యుత్ కేంద్రం, సాగర్ రెండో జోన్ ఎడమ కాలువకు పడ్డ గండి పడింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశాల మేరకు ఐబీ డీఈ రమేశ్రెడ్డి పర్యవేక్షణలో పనులు చేపట్టారు.