అంకాపూర్​ను సందర్శించిన నాందేడ్ రైతులు

అంకాపూర్​ను సందర్శించిన నాందేడ్ రైతులు

 ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్​ మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్​ జిల్లా కిన్వట్, బోకర్, హిమాయత్​నగర్​ మండలాలకు చెందిన రైతులు సందర్శించారు.  అగ్రికల్చర్​ టెక్నాలజీ మేనేజ్ మెంట్​ఏజెన్సీ(ఆత్మ)  ఆధ్వర్యంలో అంకాపూర్​లోని  పంట పొలాలను, సీడ్​ప్రాసెసింగ్​యూనిట్లను పరిశీలించారు. 

పంటల సాగు విధానాలు, గ్రామం అభివృద్ధి చెందిన తీరును తెలుసుకున్నారు. కార్యక్రమంలో రైతు సంఘం ప్రెసిడెంట్​అనంత్​రెడ్డి, వైస్​ ప్రెసిడెంట్​ ఆలూర్​నారాయణరెడ్డి, కేకే భాజన్న, ఆత్మ ప్రతినిధులు పాల్గొన్నారు.