శాయంపేట లైబ్రేరియన్​కు మెమో

శాయంపేట లైబ్రేరియన్​కు మెమో
  • ఆఫీసుకు తాళం వేసి ఉండడంతో లైబ్రెరీ చైర్మన్​ ఆగ్రహం

శాయంపేట, వెలుగు: గ్రంథాలయం ఆదివారం మూసి ఉంచడంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ అజీజ్​ఖాన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా శాయంపేట గ్రంథాలయాన్ని ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రీడింగ్​ రూంలోని న్యూస్ పేపర్లు, పాఠకుల సంతకాల రిజిస్టర్​ను పరిశీలించారు. కేవలం న్యూస్​ పేపర్లకు సంబంధించిన రీడింగ్​రూమ్​ మాత్రమే తీసి ఉంచి, ఆఫీసుకు తాళం వేసి ఉండడంతోపాటు లైబ్రేరియన్​ సుధాకర్​ విధులకు హాజరుకాకపోవడంతో అక్కడే ఉన్న సిబ్బందిపై మండిపడ్డారు. 

పాఠకులు సైతం లైబ్రేరియన్​ విధులకు సక్రమంగా హాజరు కాడని చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. మెమో ఇష్యూ చేస్తామన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన బండాగారాలని, పాఠకులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయానికి కావలసిన పుస్తకాలను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఆయనవెంట జూనియర్ అసిస్టెంట్ సంతోష్​ ఉన్నారు.