లోకల్ ట్రైన్ ఆమెపైనుంచి దూసుకెళ్లింది..ఆ తర్వాత ఏమైందంటే

లోకల్ ట్రైన్ ఆమెపైనుంచి దూసుకెళ్లింది..ఆ తర్వాత ఏమైందంటే

భూమ్మీద నూకలున్నాయి అంటే ఇదే కావచ్చు..సావు తప్పి కన్న లొట్టపోయినట్ట గాయాలతో బయటపడ్డది.  ఎలా పోయిందో .. ఎందుకు పోయిందో తెలువదు గానీ.. సరాసరి రైల్ ట్రాక్ పైకి వెళ్లింది. అప్పడే లోకల్ ట్రైన్ రయ్యిన దూసుకొచ్చి ఢీకొట్టింది. ఇంకేముందు ఆ మహిళ రైలు కింద పడి నలిగి పోయింది.. ఇది గమనించిన డ్రైవర్ రైలు ఆపినప్పటికీ .. ట్రాక్ కు రెండు వైపులా ప్లాట్ ఫాం దగ్గర ఉండటంతో బయటికి తీసేందుకు సాధ్యపడలేదు. దీంతో రైలును రివర్స్ లా నడిపి చివరికి ఆమెను బయటికి తీశారు.. ప్రాణాలయితే పోలేదు గానీ.. రెండు కాళ్లు మాత్రం విరిగాయి.. వివరాల్లోకి వెళితే.. 

నవీముంబైలో50 యేళ్ల మహిళ  ప్రమాదవశాత్తు లోకల్ ట్రైన్ కింద పడిపోయింది. థానే వెళ్లేందుకు రైలు కోసం ఎదురు చూస్తున్న మహిళ సోమవారం ఉదయం 10 గంటలకు  బెలాపూర్ స్టేషన్ లో పట్టాల పైకి జారీ పడింది. అప్పడు దూసుకొచ్చిన  రైలు ఆమె ఢీకొట్టి కొంత దూరం వరకు  లాక్కొని పోయింది.ట్రాక్ రెండు ఇరుకైన ప్లాట్ ఫాం మధ్య ఉండటంతో ఆమె బయటికి తీసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏకంగా రైలును వెనక్కి నడిపి ఆమెను ప్రాణాలతో బయటికి తీశారు. రైలు నెమ్మదిగా కదులుతున్నప్పుడు మహిళ ట్రాక్ పై ఉన్న విజువల్స్ రికార్డయ్యాయి. ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.