ఎల్​ఆర్​ఎస్​కు ఆన్​లైన్​ కష్టాలు

ఎల్​ఆర్​ఎస్​కు ఆన్​లైన్​ కష్టాలు
  • ఓపెన్​కాని  వెబ్​సైట్ 
  • ఈ నెల 31 వరకు రుసుంలో 25 శాతం మినహాయింపు  

కామారెడ్డి, వెలుగు : జిల్లాలో  ఎల్​ఆర్​ఎస్​ ఫీజ్​ చెల్లింపునకు  వెబ్​సైట్  కష్టాలు వచ్చి పడ్డాయి. ఫీజు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్​ చేసుకునేందుకు  ప్రభుత్వం 25 శాతం డిస్కౌంట్​ ఇచ్చి, ఈనెల 31 వరకూ డెడ్​లైన్​ పెట్టింది. దీంతో  జిల్లాలో ఫీజ్​ చెల్లించాలనుకుంటున్న వారు  మున్సిపల్​ ఆఫీస్​కు వచ్చి వెనుదిరుగుతున్నారు.  వెబ్​సైట్​ పని చేయకపోవడంతో ఫీజ్​ చెల్లించలేకపోతున్నారు. 

ఈ వెబ్​సైట్​ అప్​డేట్​ చేయడానికి  మరి కొన్ని రోజులు పట్టేలా ఉంది.  దీంతో  మరో వారం , 10 రోజుల తర్వాత రమ్మని ఇక్కడి సిబ్బంది  దరఖాస్తుదారులకు  చెబుతున్నారు.   ఫోన్లు చేసి  ఫీజు చెల్లించి రెగ్యులరైజ్​ చేసుకోవచ్చని చెప్పి..  తీరా ఆఫీసుకు వెళితే ఆన్​లైన్​ పని చేయట్లేదని చెప్పటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.  

2020లో  అప్లికేషన్​ ఫీజు రూ. వెయ్యి చెల్లించి  రెగ్యులరైజ్​ కోసం వేలాది  మంది  అప్లికేషన్లు పెట్టుకున్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆన్​లైన్​లో   ఎంట్రీ  చేస్తే..  ప్లాట్ల  ఓనర్​ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు ఎంత అనేది వస్తుంది. గతంలో ఆ ఫీజులు ఎక్కువ ఉన్నాయని ఎల్​ఆర్​ఎస్​ పూర్తి కాలేదు. దీంతో ప్రభుత్వం డిస్కౌంట్​ ప్రకటించింది. దీనిపై స్థానిక మున్సిపల్​ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సంబంధింత వ్యక్తులకు ఫోన్​ చేసి మిగతా అమౌంట్​ చెల్లించి రెగ్యులరైజ్​ చేసుకోవాలని సూచిస్తున్నారు.  

జిల్లాలో పరిస్థితి ఇది 

 కామారెడ్డి మున్సిపల్​ పరిధిలో 17,613 అప్లికేషన్లు, బాన్సువాడలో  1670, ఎల్లారెడ్డిలో  897 అప్లికేషన్లు వచ్చాయి.  కామారెడ్డిలో  మొత్తం అప్లికేషన్లను  క్షేత్ర స్థాయిలో  పరిశీలించి   6,375 అప్లీకేషన్లకు  ఫీజు జనరేట్​ చేశారు. ఇంకా  కొన్ని  అప్లికేషన్లు పరిశీలన దశలో ఉండగా,  ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు.  దీంతో వారు 2 రోజులుగా మున్సిపల్​ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు.  

 సమస్య పరిష్కారమవుతుంది

ఎల్​ఆర్​ఎస్​ వెబ్​సైట్​ ఆప్​డేట్​ దృష్ట్యా ఆన్లైన్​ ఓపెన్​ కావట్లేదు.  కొద్ది రోజుల్లోనే సమస్య క్లియర్​ అవుతుంది.   వెబ్​సైట్​ ఓపెన్​ కాగానే  ఫీజు జనరేట్ అయిన వారిలో ఆసక్తి ఉన్న వారి నుంచి అమౌంట్​ కలెక్టు చేసుకొని వారి ప్లాట్లను రెగ్యులరైజ్​ చేస్తాం.  ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - రాజేందర్​రెడ్డి, మున్సిపల్​ కమిషనర్​