
మానకొండూర్, వెలుగు: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో సోమవారం మానకొండూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ స్టూడెంట్స్ 21 మందికి స్కాలర్షిప్లు అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్(సీఎస్ఆర్)లో భాగంగా ఏటా మలబార్ గ్రూప్ తరఫున తెలంగాణ వ్యాప్తంగా రూ.3.14 కోట్ల విలువైన స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు షోరూం ప్రతినిధి మహమ్మద్ షరీఫ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా డీఐఈవో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు.