సైబర్​నేరాలపై జాగ్రత్తగా ఉండాలి : ఏఎస్పీ మహేందర్​

సైబర్​నేరాలపై జాగ్రత్తగా ఉండాలి : ఏఎస్పీ మహేందర్​
  • మెదక్​ జిల్లా ఏఎస్పీ మహేందర్​

మెదక్​ టౌన్, వెలుగు : విద్యార్థులు సైబర్​ నేరాలపై ఎంతో జాగ్రత్తగా ఉండటంతోపాటు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు కూడా అవగాహన కల్పించాలని మెదక్​ జిల్లా ఏఎస్పీ మహేందర్​ అన్నారు. బుధవారం సైబర్​ జాగృతి దివస్​ను పురస్కరించుకొని సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ సుభాష్​​ చంద్రబోస్​ ఆధ్వర్యంలో ​మెదక్​ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, బాలికల జూనియర్ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా సైబర్​ నేరాలు జరిగే విధానం గూర్చి వివరించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించిన వెంటనే టోల్​ఫ్రీ 1930కి, https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. కార్యక్రమంలో మెదక్​ టౌన్​ సీఐ నాగరాజు, ప్రిన్సిపాల్​ తారాసింగ్, సైబర్ క్రైమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.