పల్లెల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు: పైతర మీనాక్షి

పల్లెల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు: పైతర  మీనాక్షి

​మునిపల్లి, వెలుగు  :  పల్లెల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ ఎంతగానో  కృషి చేస్తోందని జడ్పీటీసీ పైతర  మీనాక్షి అన్నారు.​ ఆదివారం  మండల కేంద్రంలో సర్పంచ్​ రమేశ్​ఆధ్వర్యంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు.

 ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఇటీవల కానిస్టేబుళ్లుగా ఎంపికైన యువకులను సన్మానించారు. అలాగే యువతకు క్రీడా సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో  విజయకుమార్ , శివశంకర్,   నర్సింలు,  వీరన్న,  నవీన్​, కార్యదర్శి  రాజ్ కుమార్ పాల్గొన్నారు.