- అందరికీ న్యాయం చేసేందుకే సర్కారు యత్నం: దామోదర
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ అనేది ఏ కులానికీ వ్యతిరేకం కాదని, అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నించిందని మంత్రి దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ వర్గీకరణతో ఏ కులానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ఎవరూ విమర్శించలేని విధంగా వన్మాన్ కమిషన్ పారదర్శకంగా నివేదిక అందించిందన్నారు.
సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు అనుగుణంగా, స్పష్టంగానే కమిషన్ వర్గీకరణ చేసిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 14 నెలలకే చరిత్ర తిరగరాస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రోజే సీఎం ప్రకటన చేయడంతో పాటు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కమిట్మెంట్ అని తెలిపారు. అందరికీ న్యాయం, అందరికీ ఫలాలు అందాలన్న లక్ష్యంతోనే వర్గీకరణ జరిగిందన్నారు.