కార్పొరేషన్ ఏర్పాటుకు తొలగనున్న అడ్డంకి : మంత్రి శ్రీధర్​బాబు

కార్పొరేషన్ ఏర్పాటుకు తొలగనున్న అడ్డంకి : మంత్రి శ్రీధర్​బాబు
  • అసెంబ్లీలో మున్సిపల్ ​సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్​బాబు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం కార్పొరేషన్​ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే క్యాబినెట్​ ఓకే చెప్పింది. మున్సిపల్​సవరణ బిల్లును మంత్రి శ్రీధర్​ బాబు మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్​సమావేశాల్లోనే దీనిపై చర్చ జరుగనుంది.  కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్​ మండలంలోని ప్లేన్​ ఏరియాలుగా ఉన్న సుజాతనగర్​, నర్సింహ సాగర్​, కొమిటిపల్లి, నిమ్మలగూడెం, లక్ష్మీదేవిపల్లి, మంగపేట, నాయకుల గూడెం పంచాయతీలను కలుపుతూ కార్పొరేషన్​ ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 

ఆ తర్వాత గవర్నర్​ఆమోదంతో గెజిట్​రిలీజ్​కానుంది.  ఈ విషయమై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు.  సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.