కార్యకర్తలకు అండగా ఉంటాం : ఎంపీ వంశీకృష్ణ

 కార్యకర్తలకు అండగా ఉంటాం :  ఎంపీ వంశీకృష్ణ
  • అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ లీడర్లను పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు:​ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న​ కార్యకర్తలకు అండగా ఉంటామని చెన్నూర్​ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. శనివారం మందమర్రి ప్రాంతంలో నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న మందమర్రి మండలం సారంగపల్లి మాజీ సర్పంచ్, కాంగ్రెస్​ సీనియర్​ లీడర్ ​కమల మనోహర్, జైపూర్​ మండలం నర్సింగాపూర్ ​గ్రామానికి చెందిన కాంగ్రెస్ సోషల్​మీడియా కో ఆర్డినేటర్​కాజీపేట సతీశ్​ కుమార్​ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ హైదరాబాద్​లోని నిమ్స్​ డాక్టర్లతో ఫోన్​లో మాట్లాడి సతీశ్​కు మెరుగైన ట్రీట్​మెంట్​ అందించాలని కోరారు. ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారు. 

పోచమ్మ ఆలయంలో పూజలు

మందమర్రి మున్సిపాలిటీ వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి 18 వార్డులోని గాంధీనగర్​ పోచమ్మ తల్లి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్​ లీడర్లతో కలిసి పూజలు చేశారు. 

మందమర్రిలో పర్యటించిన వివేక్​ వెంకటస్వామి, వంశీకృష్ణను స్థానిక కాంగ్రెస్​ లీడర్లు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మందమర్రి తహసీల్దార్​ సతీశ్​కుమార్, మున్సిపల్​ కమిషనర్ ​వెంకటేశ్వర్లు, సీఐ శశిధర్​రెడ్డి పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.