ఉప్పల్​ స్టేడియంలో క్రికెట్​ అభిమానులను అలరించనున్న తమన్

ఉప్పల్​ స్టేడియంలో క్రికెట్​ అభిమానులను అలరించనున్న తమన్
  • మార్చి 27న    లక్నోతో సన్ రైజర్స్ మ్యాచ్​.. మ్యూజికల్​నైట్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఐపీఎల్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజికల్ నైట్ఈవెంట్​జరగనుంది. ఈ నెల 27న రాత్రి 7:30 గంటలకు ఉప్పల్లో  లక్నోతో సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది. అంతకు ముందు 6.30 గంటలకు తమన్​తన మ్యూజిక్​బ్యాండ్​తో ఫ్యాన్స్​ను ఉర్రూతలూగించనున్నాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది. ఈసారి సరికొత్తగా ఐపీఎల్ మ్యాచ్​లకు ముందుగా ఆయా స్టేడియాల్లో మ్యూజికల్​నైట్​నిర్వహిస్తోంది. వరుస చిత్రాలతో బిజీగా ఉండే తమన్​సీసీఎల్​లో తనకు ఇష్టమైన క్రికెట్ ఆడుతూ అదరగొడుతుంటాడు. ఈసారి క్రికెట్ లవర్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి మ్యూజికల్ ఈవెంట్ చేయబోతున్నాడు.