
- మెడికల్ వేస్ట్ ఉన్నట్లు అనుమానాలు
జీడిమెట్ల, వెలుగు: స్క్రాప్తో నిండి ఉన్న ఓ డీసీఎం మంటల్లో కాలి దగ్ధమైన ఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... దూలపల్లి రోడ్డు ఫాక్స్సాగర్ సమీపంలో కొంత మంది స్ర్క్రాప్ దుకాణం నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో గురువారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో స్క్రాప్తో లోడ్ చేసి ఉన్న డీసీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ప్రమాదవశాత్తు కాలిపోయిందా? ఎవరైనాకావాలని కాల్చారా? అని తేలాల్సి ఉంది. కాగా డీసీఎంలో మెడికల్ వేస్ట్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.