
హనుమకొండ, వెలుగు: నేషనల్ డెంటిస్ట్ డే సందర్భంగా ఇండియన్ డెంటల్అసోసియేషన్ వరంగల్ బ్రాంచ్ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ నుంచి పబ్లిక్ గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్కళాప్రాంగణం వరకు గురువారం 2కె వాకథాన్ నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 2కే వాకథాన్ ను ప్రారంభించగా, ఎంపీ కడియం కావ్య, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ వి.నరేశ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
కార్యక్రమంలో వరంగల్ డెంటిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.రాంప్రసాద్ రెడ్డి, సెక్రటరీ డా.వేణుమాధవ్, ట్రెజరర్ డా.కార్తీక్, సీనియర్ డెంటిస్ట్స్ డా.జయసింహరెడ్డి, డా.అనిల్ రెడ్డి, డా.సురేందర్ రెడ్డి, డా.మనోరంజన్ రెడ్డి, డా.రమేశ్ బాబు, డా.రజనీకాంత్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.