అప్పులు తీర్చలేక చెఫ్ ​ఆత్మహత్య

అప్పులు తీర్చలేక చెఫ్ ​ఆత్మహత్య

గచ్చిబౌలి/జీడిమెట్ల, వెలుగు: ఇంటి నిర్మాణానికి, పిల్లల చదువు కోసం చేసిన అప్పులు తీర్చలేక రాయదుర్గం పీఎస్​పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నేపాల్ కు చెందిన ఖడ్కా బహదూర్(49) బతుకుదెరువు సిటీకొచ్చి రాయదుర్గం మధురానగర్​లో ఉంటున్నాడు. షాగౌస్​ రెస్టారెంట్​లో చెఫ్​గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ముగ్గురు కొడుకులు, రెండో భార్యకు ఒక కుమారుడు సంతానం. 

ఖడ్కా బహదూర్ ప్రస్తుతం రెండవ భార్య మమతా మహంతితో కలిసి ఉంటున్నాడు. గతంలో సొంతూరులో ఇల్లు కట్టేందుకు, పిల్లల చదువు కోసం, భూమి కొనుగోలు చేసేందుకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు జీతం చాలకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కొడుకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

లవ్ ​ఫెయిల్​ అయ్యి యువకుడు

లవ్​ప్రపోజ్​చేయగా, యువతి నిరాకరించడంతో ఓ యువకుడు ఐదో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్​బషీరాబాద్​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన అముదన్ విజయ్(23) ఐటీ ఉద్యోగి. కొంపల్లిలోని కీర్తిరెడ్డి హాస్టల్​లో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్​చేస్తున్నాడు. ఇతని తల్లిదండ్రులు కుటుంబ కలహాలతో విడిపోయారు. తండ్రి అముదన్​సెల్వన్​సౌదీఅరేబియాలో ఉంటుండగా తల్లి తమిళనాడులో ఉంటుంది. విజయ్ కు చిన్ననాటి స్నేహితురాలు అంటే ఇష్టం. ఇటీవల ఆమెకు లవ్​ప్రపోజ్​చేయగా, ఇన్నేండ్లు తాను స్నేహితుడిగానే చూశానని, ప్రేమించలేదని చెప్పింది. మనస్తాపానికి గురైన విజయ్ రెండు రోజులుగా హాస్టల్​గదికే పరిమితం అయ్యాడు. 6 పేజీల సూసైడ్ నోట్​రాసి ఆదివారం రాత్రి హాస్టల్ బిల్డింగ్​ఐదో ఫ్లోర్​నుంచి దూకి ఆత్మహత్య  చేసుకున్నాడు.