పసుపు బోర్డు సెక్రటరీగా భవాని

పసుపు బోర్డు సెక్రటరీగా భవాని
  • మనోహరాబాద్​లో పసుపు ఆధారిత పరిశ్రమ విజిట్​

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్​ నగరంలోని నేషనల్​ పసుపు బోర్డు సెక్రటరీగా ఎన్​.భవానీ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం పసుపు బోర్డు చైర్మన్​ పల్లె గంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 2017  ఐఏఎస్​ బ్యాచ్​కు చెందిన ఆమె ఢిల్లీ నుంచి వచ్చారు. జక్రాన్​పల్లి మండలం మనోహరాబాద్​లోని పసుపు ఆధారిత పరిశ్రమను ఆమె పరిశీలించారు. 

ఆత్మ నిర్భర్​ భారత్​ స్కీమ్​లో భాగంగా రూ.3 కోట్ల వ్యయంతో రైతులు సంఘాలు ఏర్పడి నిర్వహిస్తున్న అనుబంధ పరిశ్రమలను చూసి ఆమె సంతోషం వ్యక్తం చేశారు.  కమ్మర్​పల్లి మండల కేంద్రంలోని టర్మరిక్​ రీసెర్చ్​ సెంటర్​ను సందర్శించి, సెంటర్​ అందిస్తున్న సేవలను సైంటిస్ట్​ మహేందర్​రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట స్పైస్​ బోర్డు డిప్యూటీ డైరెక్టర్​ సుందరేశన్​, తిరుపతిరెడ్డి ఉన్నారు.