కాంగ్రెస్​లో చేరిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు

కాంగ్రెస్​లో చేరిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు

మంచిర్యాల, వెలుగు: విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నౌండ్ల సంతోష్ చారి, నాయకులు ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. వారికి డీసీసీ చైర్​పర్సన్​ కొక్కిరాల సురేఖ తమ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్​లో చేరిన వారిలో కుంట్ల శ్రీనివాసాచారి, సజ్జనపు జగదీశ్వరాచారి, తాటికొండ రాజేశం చారి, మాటూరి సత్యనారాయణ చారి, శ్రీమంతుల రాజవీరు చారి, శ్రీరామోజు సంతోష్ చారి, తొలికుంట్ల రాజాచారి, మునిగంటి శ్రీనివాస్ చారి, శ్రీరామోజు రాజమొగిలి చారి, మట్టల రమేశ్ చారి ఉన్నారు.