రూ. 250 కోట్లతో 104 కొత్త సబ్​స్టేషన్లు : సీఎండీ వరుణ్​రెడ్డి

రూ. 250 కోట్లతో 104  కొత్త సబ్​స్టేషన్లు : సీఎండీ వరుణ్​రెడ్డి

భీమదేవరపల్లి,వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా రూ. 250 కోట్లతో 104  కొత్త 33/11కేవీ సబ్​స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్పీడీసీఎల్​ సీఎండీ కర్ణాటి వరుణ్​రెడ్డి వెల్లడించారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు​లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 1504 సబ్​ స్టేషన్లకు ఇంటర్​లింకింగ్​వ్యవస్థ త్వరలో పూర్తవుతుందని, తద్వారా నిరంతర విద్యుత్ అందనుందని పేర్కొన్నారు. ఓవర్​లోడ్, డీటీఆర్, కెపాసిటీ ఇతర సమస్యలపై సిబ్బంది తక్షణమే పరిష్కరి స్తూ రైతులకు నాణ్యమైన విద్యుత్​ అందిస్తున్నారని తెలిపారు.

 133 కేవీ సామర్థం కలిగిన 5 పెద్ద సబ్​స్టేషన్ల నిర్మాణం కూడా చేపట్టనున్నట్టు చెప్పారు. సాగుకు నోచుకోని భూముల రైతులు సోలార్​విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకొస్తే ఎంతో లాభాదాయకంగా ఉంటుందని సూచించారు. ఆయనవెంట ఎస్ఈ మధుసూదన్, డీఈ సామ్యానాయక్​,ఏడీ  రాజేశ్వర్​రావు,ఏఈ లక్ష్మణ్​ తదితరులు పాల్గొన్నారు.