
ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 300
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైన డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయసు: 1 ఏప్రిల్ 2021 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమ్స్, మెయిన్స్ (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: ప్రిలిమ్స్ ఎగ్జామ్ మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. పరీక్షకు 60 నిమిషాల సమయం కేటాయించారు.
మెయిన్స్ ఎగ్జామ్: ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 30 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్టు (లెటర్ రైటింగ్ 10 మార్కులు, ఎస్సే 20 మార్కులు) ఉంటుంది. ఈ రెండు పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తారు. నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కు రూ.100 చెల్లించాలి.
చివరితేది: 21 సెప్టెంబర్
ఫేజ్1 ఆన్లైన్ ఎగ్జామ్: అక్టోబర్ 2021
ఫేజ్2 ఆన్లైన్ ఎగ్జామ్: నవంబర్ 2021
వెబ్సైట్: www.newindia.co.in