సెమిస్టర్​ పరిక్షలకు అనుమతించండి ..ఓయూ విద్యార్థులు ఆందోళన

సెమిస్టర్​ పరిక్షలకు అనుమతించండి ..ఓయూ విద్యార్థులు ఆందోళన

సెమిస్టర్​పరిక్షలకు అనుమతించాలని ఓయూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.  75 శాతం హాజరు ఉంటేనే తమను సెమిస్టర్​ ఎగ్జామ్స్​కు అనుమతిస్తామని ప్రిన్సిపాల్​ కాశిం ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు  ఓయూ ప్రధాన రహదారిపై  బైఠాయించారు. కొంతమంది విద్యార్థులు  వివిధ రకాల పోటీపరీక్షలకు ప్రిపేర్​ అవుతున్నారు.

Also Read :- హైదరాబాద్ ఎల్బీ నగర్లో విషాదం

 అలాంటి వారు 75% అటెండెన్స్ మైంటైన్ చేయాలని ఒత్తిడికి గురిచేస్తున్నాడని వాపోయారు. గ్రూప్​ 2 కి ప్రిపేర్​ అవుతున్న వారు 75% అటెండెన్స్ ఎలా మెంటేన్ చేస్తామని ప్రశ్నించారు. తక్షణమే సెమిస్టర్​ ఎగ్జామ్​ ఫీజు కట్టించుకొని పరీక్షలకు అనుమతించే వరకు నిరసన కొనసాగిస్తామని విద్యార్థులు డిమాండ్​ చేశారు.