ఢిల్లీలోని పాక్‌‌‌‌‌‌‌‌ హై కమిషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో.. కేక్‌‌‌‌‌‌‌‌తో సంబురాలు?

ఢిల్లీలోని పాక్‌‌‌‌‌‌‌‌ హై కమిషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో.. కేక్‌‌‌‌‌‌‌‌తో సంబురాలు?
  • మండిపడుతున్న నెటిజన్లు

న్యూఢిల్లీ: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో ఇప్పటికే దేశమంతా ఆగ్రహంగా ఉంది. దాడి తర్వాత ఓ ముస్లిం వ్యక్తి ఢిల్లీలోని పాకిస్తాన్  హైకమిషన్  ఆఫీసులోకి కేక్  తీసుకొని ప్రవేశించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆ యువకుడి తీరుపై మండిపడుతున్నారు. పహల్గాంలో అమాయకులను చంపి సెలబ్రేట్  చేసుకుంటున్నారని ఫైర్  అయ్యారు. 

కేక్  తీసుకొని వెళ్తున్న ఆ యువకుడిని పాక్  హైకమిషన్  ప్రాంగణంలో మీడియా అడ్డుకుని పలు ప్రశ్నలు వేసింది. ‘‘ఆ బాక్సులో ఏముంది? చూస్తే కేక్  ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకు కేక్  తీసుకుని పోతున్నారు? ఈ టైంలో సెలబ్రేట్  చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? మీరు పాకిస్తాన్  హైకమిషన్ కు చెందిన వ్యక్తా?” అని మీడియా ప్రతినిధులు ఆ వ్యక్తిని అడిగారు. అయితే, అతను జవాబు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.