దడ పుట్టిస్తున్న పాలధర..లీటర్​ రూ.370.. ఎక్కడంటే..

దడ పుట్టిస్తున్న పాలధర..లీటర్​ రూ.370..  ఎక్కడంటే..

Pakistan :  మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా ఉంది దాయాది దేశంలోకి పాక్ పౌరుల పరిస్థితి. ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా రోజు రోజుకీ పెరిగిపోతుండడంతో ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదు అంటూ లబోదిబోమంటున్న పాక్ పౌరులకు ఆ దేశ ప్రభుత్వం మరో షాకిచ్చింది. నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన పాలపై పన్నుని విధించింది. దీంతో సడెన్ గా పాల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం పాకిస్తాన్ లో పాల ధరలు ఎంతగా మండిస్తున్నాయంటే.. ప్రపంచంలో అబివృద్ధి చెందినా దేశాలుగా పేరు గాంచిన ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాలకంటే ఎక్కువ ధరలు పాక్ లోనే ఉన్నాయి.

పాక్‌ లో పాల ధర ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్‌ ధర రూ. 370 కి చేరింది. అక్కడి ప్రజలు ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతుండగా.. అక్కడి ప్రభుత్వం కొత్తగా పాలపై టాక్స్‌ (Milk Tax) విధించింది. దీంతో స్థానికంగా పాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలైన ఫ్రాన్స్, ఆస్ట్రేలియా (Australia) కంటే పాల ధరలు (Milk Price) పాకిస్తాన్‌లోనే అధికంగా ఉండటం గమనార్హం. 

ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌ ధరలు సైతం అక్కడి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పాకిస్తాన్‌లో పాలపై ఇంతకుముందు ఎలాంటి పన్నూ ఉండేది కాదు. కానీ గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్యాకేజ్డ్‌ పాలపై ప్రభుత్వం 18 శాతం టాక్స్‌ విధించింది. దీంతో పాల ధరలు 25 శాతం పైగా. కొత్తగా పన్ను వేయడంతో కరాచీ (Karachi) లో అల్ట్రా హై టెంపరేచర్‌ పాల ధర 370 రూపాయలకు చేరింది. పారిస్‌లో 1.23 డాలర్లు కాగా.. మెల్బోర్న్‌లో 1.08 డాలర్లు మాత్రమే. పాల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.బెయిలవుట్‌ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) విధించిన షరత్తుల్లో భాగంగా ఆ దేశ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ఏకంగా 40 శాతం మేర పన్నులు పెంచింది.  

పాల ధరలు పెరగడంపై ఆ దేశ ఆర్ధిక నిపుణులు స్పందిస్తూ...  దీని వలన ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని అంటున్నారు. అంతేకాదు ప్రజల వేతనాలు అతి తక్కువగా ఉన్నాయని..  ఇప్పుడు పాల పెంపు వారి ఖర్చు చేసే సామర్ధ్యంపై పడుతుందని.. నిత్యావసర వస్తువులనే కాదు… ఇక నుంచి పాలను కొనాలన్నా ఆలోచించే పరిస్తితి నెలకొన్నదని.. అంతంత మాత్రంగా ఉన్న వేతనాన్ని ఖర్చు చేసే సామర్థ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాయాది దేశంలో సుమారు 40 శాతం మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని, ముఖ్యంగా చిన్నారుల్లో పౌష్టికాహార లోపానికి ఇప్పుడున్న పరిస్థితులు కారణంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు పాల ధర పెంపు చిన్నారుల పరిస్తితి పై తీవ్ర ప్రభావం చూపించనుంది.