ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపండి

ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపండి
  •    ఎమ్మెల్యేకు ఆ గ్రామస్తుల వినతి

భద్రాచలం, వెలుగు : పోలవరం ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాలో విలీనమైన గుండాల, పిచ్చుకులపాడు, పురుషోత్తపట్నం, ఎటపాక, కన్నాయిగూడెం పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని ఆ గ్రామాలకు చెందిన ప్రజలు మంగళవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు.

అభివృద్ధికి దూరంగా ఐదు పంచాయతీలు ఉన్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇద్దరు సీఎంల మీటింగ్​లో విభజన సమస్యల గురించి ప్రస్తావించేటప్పుడు తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి ఐదు జీపీల కోసం డిమాండ్ చేయాలని కోరారు.