![ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు బెయిల్ మంజూరు](https://static.v6velugu.com/uploads/2025/02/phone-taping-case-ex-dsp-praneetrao-bail-granted-by-nampally-court_bDRJNLgF4t.jpg)
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ ను నాంపల్లి సెషన్స్ కోర్టు మంజూరు చేసింది. ఇప్పటికే సహ నిందితులుగా ఉన్న తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు బెయిల్ పై విడుదలయ్యారు.
11నెలలపాటు చంచల్గూడా జైలులో రిమాండ్ఖైదీగా ఉన్న ప్రణీత్రావుకు షరతులతో కూడిన బెయిల్ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. విచారణ కొనసాగింపు చర్యల్లో భాగంలో పోలీసులు ఎలాంటి ఆధారాల్ని కోర్టుకు దాఖలు చేయలేదని... . కౌంటర్లో పేర్కొన్నట్టుగా విచారణ పెండింగ్లో ఉందన్న విషయం అవాస్తవమని ప్రణీత్ రావు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైలులో కొనసాగుతున్న దుగ్యాల ప్రణీత్రావు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై మంగళవారం ( ఫిబ్రవరి 11) ఆయన తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు 1వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు పూర్తి చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివారెడ్డి గైర్హాజరు కావడంతో పీపీ వాదనల కోసం విచారణను వాయిదా వేస్తూ జడ్జీ రమాకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కేసులో ప్రస్తుతం ప్రణీత్రావు ఒక్కరే జైలులో ఉన్నారని, ఈ కేసులో ఉన్న భుజంగరావును ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర బెయిల్ను ... ఇదే కోర్టు మంజూరు చేసిందని గుర్తుచేశారు. హైకోర్టుకు దాఖలు చేసిన కౌంటర్లో విచారణ పూర్తి కాలేదని అధికారులు పేర్కొన్నప్పటికీ పీపీ వాదనల్ని హైకోర్టు తోసిపుచ్చిందన్నారు.