
నందిపేట, వెలుగు : రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేయనున్న పాదయాత్రలు, పార్టీ సిద్ధాంతాలను గ్రామగ్రామాన వివరించాలని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్రెడ్డి కోరారు. మంగళవారం నందిపేట మండల కేంద్రంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో డీసీసీబీ చైర్మన్ రమేశ్రడ్డి అధ్యక్షతన నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తూనే ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మహిపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు తదితరులు పాల్గొన్నారు.