
పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నోడల్ఆఫీసర్దివ్య దేవరాజన్ తెలిపారు. హోలీ పండుగ సందర్భంగా రద్దు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్తోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు గుర్తించాలన్నారు. ఈ నెల 18న(మంగళవారం) ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.