స్లాబ్​ కింద చదువులు

స్లాబ్​ కింద చదువులు

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం పల్లెగడ్డ తండాలోని ప్రైమరీ స్కూల్​ బిల్డింగ్​ పూర్తి కాక పోవడంతో విద్యార్థులు స్లాబ్​ కిందే చదువుకోవాల్సి వస్తోంది. ఈ స్కూల్​లో 5వ తరగతి వరకు ఉండగా, 28 మంది స్టూడెంట్స్​ చదువుకుంటున్నారు. పాత స్కూల్​ బిల్డింగ్​ శిథిలమై కూలిపోవడంతో ‘మన ఊరు–మన బడి’ కింద రూ. 

29 లక్షలతో స్కూల్​ బిల్డింగ్​ మంజూరు చేశారు. స్లాబ్​ వేసి వదిలేయగా, ఏడాది నుంచి వర్క్స్​ జరగడం లేదు. దీంతో స్లాబ్​ కిందనే టీచర్లు విద్యార్థులకు చదువులు చెబుతున్నారు. బిల్డింగ్​ వర్క్స్​ కంప్లీట్​ చేయాలని పేరెంట్స్​ కోరుతున్నారు.- కామారెడ్డి , వెలుగు

ALSO READ : ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్..