
- పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి
పర్వతగిరి(సంగెం), వెలుగు :రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపెల్లిలో గురువారం రాత్రి నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మండల కోఆర్డీనేటర్మాసాని యాకూబ్తో కలిసి ఆయన పాల్గొన్నారు.
అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం అవమానించిందన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.